calender_icon.png 22 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలేరులో విద్యా శాఖ ఇన్ ఫ్రా అభివృద్ధి

22-08-2025 01:58:34 AM

  1. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సైకిళ్ల పంపిణీతో ఆడపిల్లల డ్రాప్ ఔట్ తగ్గాలి

ఖమ్మం, ఆగస్టు 21 (విజయ క్రాంతి): 497 కోట్లతో పాలేరు నియోజకవర్గ పరిధి లో విద్యా శాఖ ఇన్ ఫ్రా అభివృద్ధికి చర్యలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొం గులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి గు రువారం తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పిండిప్రోలు, బోదులబండ జెడ్పీ.హెచ్.ఎస్. పాఠశాల వి ద్యార్థినులకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేసారు.

పిండిప్రోలు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం పాలేరు ని యోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదివే బాలిక లకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ద్వారా సైకిల్స్ పంపి ణీ చేశామని, ప్రస్తుత సంవత్సరం కొత్తగా 8వ తరగతి వచ్చిన బాలికలకు సైకిల్స్ పం పిణీ చేస్తున్నామని అన్నారు.

గురువారం తిరుమలాయపాలెం మండలంలో 92, నేలకొండపల్లి మండలంలో 81 సైకిళ్లను వి ద్యార్థినులకు అందిస్తున్నామని అన్నారు. పేదల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం విస్మరించిన విద్యా శాఖకు ప్రజా ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. గడిచిన 19 నెలల కాలంలో పాలేరు నియోజకవర్గంలో 497 కోట్ల రూపాయలు విద్యా రంగంలో ఇన్ ఫ్రా అభివృద్ధి కోసం మంజూరు చేయ డం జరిగిందని అన్నారు.

జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీ కృత గురుకులాల నిర్మాణం, తిరుమలాయపాలెంలో ఐటిఐ కేంద్రం, హస్టల్, కూసు మంచి జూనియర్ కళాశాల మంజూరు చేసామని, పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని గురుకులాల్లో చదివే పిల్లలకు 40 శాతం డైట్, 200 శాతం కా స్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని అన్నా రు.

ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ ఔట్ లేకుం డా చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా హెడ్ మాస్టర్, ఉపా ధ్యాయులు కృషి చేయాలని మంత్రి కోరా రు.జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆడపిల్లలు పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల చదువు మానకూడదు అనే మంచి ఉద్దేశంతో పి.ఎస్.ఆర్. ట్రస్టు ద్వారా మంత్రివర్యులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న త తరగతులు చదివే బాలికలకు సైకిల్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు.

8వ తరగతి నుంచి డ్రాప్ ఔట్స్ పెరుగుతాయని శాస్త్రీయంగా తెలిసిందని, ప్రయాణ భారం దృ ష్ట్యా బాలికలు చదువుకు దూరం కావద్దని భావించిన మంత్రి 8వ తరగతి చదివే బాలికలకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని, సైకిళ్ల ను బాలికలు సద్వినియోగం చేసుకొని ఉన్న త చదువులు చదవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థులకు రెండవ జత ఏక రూప దుస్తులు పంపిణీ పెండింగ్ ఉంటే వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిణి నాగ పద్మజ, ఖమ్మం రెవె న్యూ డివిజనల్ అధికారి నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమే ష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, డిసిసిబి డైరక్టర్ బొ ర్రా రాజశేఖర్, తహశీల్దార్లు విల్సన్, వెంకటేశ్వర్లు, ఎంపిడివో లు సిలార్ సాహెబ్, ఎర్ర య్య, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, నిర్మల, జిసిడీఓ తులసి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.