10 May, 2026 | 8:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

22-01-2026 01:21 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

నల్లగొండ, జనవరి 21 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చే స్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్‌లో బుధవారం నల్లగొండ జిల్లా టీఎన్జీవో యూనియన్ నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు ఈహెచ్‌ఎస్, పెండింగ్ బిల్లులు, డీఏ విడుదల పరిష్కారం కోసం సీ ఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.

టీఎన్జీవో యూనియన్ బిల్డింగ్ పూర్తి చే స్తానని హామీ ఇచ్చారు. టీఎన్జీవో జిల్లా అధ్య క్షులు నాగిళ్ల మురళి, కార్యద ర్శి జే.శేఖర్‌రెడ్డి, ఎన్‌డీసీఎంఎస్ మాజీ చైర్మ న్ బోళ్ల వెంకటరెడ్డి, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ఉపా ధ్యక్షుడు సిహెచ్. నర్సింహచారి, విజయ్, టీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల  వెంకట్రామిరెడ్డి, కోశాధికారి జయరాజు, అసోసి యేట్ అధ్యక్షులు డిఐ రాజు, దశరథ, ప్రదీ ప్, లక్ష్మయ్య, లింగయ్య నారాయణస్వామి రాణదేవ్, ౪ తరగతి ఉద్యోగుల అధ్యక్షు లు భిక్షం, మణి, కృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు.