15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎలక్ట్రిక్ కారు దగ్ధం

17-11-2025 01:23 AM

-దట్టంగా అలుముకున్న పొగలు

-హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘటన

ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకుని, తీవ్ర కలకలం రేగింది.

ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే మంటలు వేగంగా వ్యాపించి, కారు పూర్తిగా కాలి బూడిదైంది. పక్కనే ఉన్న మరో కారుకు కూడా మంటలు అంటుకుని, అది పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అదే సమయంలో, గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని, వాహనాల రాక పోకలను నియంత్రించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.