26 June, 2026 | 6:36 PM

Breaking News

నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •  

42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

17-11-2025 01:24 AM

మిర్యాలగూడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన  బీసీల న్యాయసాధన దీక్ష విజయవంతం చేయాలని యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు. 

సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

లేదంటే  బీసీలను అణిచివేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీక్షకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,  ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాయకులు తమ్మడ బోయిన అర్జున్, ఎండి సలీం , పగిడి రామలింగయ్య యాదవ్, దశరథ్,  పోలగాని వెంకటేష్ గౌడ్, జక్క నాగేశ్వరరావు, సిద్ధం రాజు, రవీందర్ గౌడ్, ఉపేందర్, గంగాధర్ తదితరులు మద్దతు తెలిపారు.