17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఎక్స్‌ప్రెస్ హైవేపై త్వరలో ఎలివేటర్ వంతెన నిర్మాణాలు

21-05-2025 01:04 AM
  1. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కలిశాను 

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెంటనే సానుకూల స్పందన

అబ్దుల్లాపూర్‌మెట్, మే 20: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్స్ప్రెస్ హైవేపై తర్వలో రెండు ఎలివేటర్ వంతెన నిర్మాణా లు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్, లక్ష్మా రెడ్డిపా లెం ఈ రెండు చోట్ల వంతెన నిర్మాణానికి కో సం కేంద్ర రోడ్ల, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి భువనగరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు.

ఎంపీ చామల విజ్ఞ ప్తి మేరకు సమస్య తీవ్రత, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత విభాగాల అధికారులకు ఎలివేటర్ వంతెన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా అతి త్వ రలో ఈ అంశంపై కార్యాచరణ చేపడతామ ని కేంద్ర మంత్రి హామీవ్వడం జరిగింది. ఎం పీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్ర మం త్రికి రాసిన లేఖను సంబంధిత అధికారులకు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్లు అందజే శారు.

అనంతరం వారు మాట్లాడుతూ...పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో ఇటీవల వేగం గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త గా 100కు పైగా కాలనీలు వెలిశాయన్నారు. రోడ్ల విస్తర్ణలో భాగంలో ఇరువైపుల గ్రిల్స్ ఏర్పాటు చేయడం వలన ప్రజలు నానా ఇ బ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విజయవాడ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే వలన రహదారి దాటడం ప్రజలకు ప్రమాద కారణంగా మారిందన్నారు.

ముఖ్యంగా వృద్ధు లు, చిన్నారులు, మహిళలు రహదారి దాటే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యల పరి ష్కారానికి రెండు ఎలివేటర్ వంతెనలు నిర్మించాలన్నఎంపీకి విన్నవించగా.. వారు సంబంధిత కేంద్రమంత్రి లేఖ రాశారని..

వారు వెంటనే సానుకూలంగా స్పదించారన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదలు తెలుపుతు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, పసుల రాజేందర్, దండెం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.