02-10-2025 12:00:00 AM
జిన్నారం, అక్టోబర్ 1 : జిన్నారం మున్సిపల్ రాళ్లకత్వ పరిధిలోని 286 సర్వే నెంబర్ లో జరుగుతున్న క్రషర్ ఏర్పాటు పనులు ఆ పాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు రాళ్లకత్వ గ్రామస్తులు తెలిపారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను బుధవారం క్రషర్ యాజమాన్యంతో పాటు జిన్నారం సీఐ, ఎస్ఐకి అందజేశారు.
కోర్టు ఉత్తర్వులను అమలు చే యాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశా రు. పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ క్ర మంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జ రిగితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత వహించాలన్నారు.