26 June, 2026 | 6:32 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలోకి ఎదిగేలా బోధించాలి

14-05-2025 12:56 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

చివ్వేంల మే 13: చివ్వేంల  మండలంలోని దురాజుపల్లిలో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థానం చేరుకునేలా చూడాలని,  సమాజంలోని అసమానతలు తొలగాలంటే విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, అట్టి విద్యను అందించే ఉపాధ్యాయులపై గురుతరమైన బాధ్యత ఉందని కలెక్టర్ తెలియజేశారు.

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ప్రణాళికలు రచించి ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు వచ్చేలా చూడాలని సూచించారు. 

ఈ కార్యక్రమానికి మండల రిసోర్స్ పర్సన్స్, ఆంగ్లము, గణితము, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠశాలల సహోఉపాధ్యాయులు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, పూలమ్మ, స్వామి నారాయణ  గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ పి రాంబాబు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.