15 June, 2026 | 8:40 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

అందర్నీ ఆదుకోవాలి

27-09-2024 12:00 AM

ఇటీవల కురిన భరీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటు దారుణంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవడం కోసం రాష్ట్రప్రభుత్వం పరిహారాన్ని సైతం ప్రకటించింది. అయితే చాలా చోట్ల బాధితులు తమకు పరిహారం అందలేదని వాపోతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేయడంతో చేసిన పొరబాట్లకు తాము బలవుతున్నామని వరు వాపోతున్నారు. ఇలా నష్టపరిహారం అందని రైతుంతా పొలాల్లో సెల్ఫీలు సైతం దిగి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు కూడా. అయినా ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు.

ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వేసిన పంటలు తమ కళ్ల ముందే ఎందకూ పనికి రాకుండా పోవడం చూసి రైతులు ఆవేదనతో తల్లడిల్లి పోతున్నారు.  ప్రతిపక్షాలకు ఇదో ఆయుధంగా మారుతోంది. తమది ప్రజాప్రభుత్వం అని ఘనంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికయినా జరిగిన తప్పును సరిదిద్ది బాధితులందరికీ పరిహారం లభింఏలా చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో  వరదల సమయంలో ఎంతో శ్రమకోర్చి బాధితులను ఆదుకున్న సర్కార్ ఈ కారణంగా బద్నాం అవుతుంది.

  బలరాం నాయక్, మహబూబాబాద్.