calender_icon.png 4 August, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం

31-07-2025 12:56:31 AM

జనగామ, జూలై 30 (విజయ క్రాంతి) మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య పిలుపునిచ్చారు. వరల్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ రైల్వే స్టేషన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, కార్మిక శాఖ, చైల్ హెల్ప్ లైన్ 1098, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, జీఆర్పి, ఆర్పీఎఫ్ పోలీసులు, ప్రయాణికులకు మానవ అక్రమ రవాణా సంబంధించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైలు మార్గాల ద్వారా తరచుగా మానవ అక్రమ రవాణా మార్గాలు కావడంతో, ఏ చిన్న అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా అప్రమత్తం కావాలన్నారు.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్  మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, వలస కూలీలు ముఖ్యంగా ఈ ముప్పుకు గురవుతుంటారని, రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉండే చిన్నారులు, భయంతో కనిపించే మహిళలు లేదా యువత, ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేని వ్యక్తులు వంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించినప్పుడు, వెంటనే 1098, 100, 112 నెంబర్లకు సమాచారం అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి  కుమారస్వామి, చైల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, జి ఆర్ పి హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, కానిస్టేబుల్ వెంకన్న, రైల్వే స్టేషన్ మాస్టర్ మల్లికార్జున్, స్కోప్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, సిబ్బంది లావణ్య, తరుణ్ పాల్గొన్నారు.