15 June, 2026 | 2:43 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

‘ఈవీఎం’లు పారదర్శకమే

22-06-2024 12:00 AM

‘ఈవీఎం’లను హ్యాక్ చేయడం ఎవరి తరమూ కాదు. ‘అది అసాధ్యం’ అని ఐ.ఐ.టి డైరెక్టర్ రజత్ స్పష్టం చేశారు కూడా. ప్రతిపక్షాలు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుంది. అలా కాక, హ్యాక్ జరిగిందనడం అజ్ఞానమే. నాయకులు తమ తప్పులు తెలుసుకోక ఓటమి చవిచూసేసరికి ఈవీఎంలు గుర్తుకు వస్తాయి. ‘హ్యాక్ జరిగిందని’ గగ్గోలు పెడతారు. మెజారిటీ వస్తే ఒక విధంగా మాట్లాడటం, రాకపోతే మరోలా మాట్లాడటం వారికి తగదు. అన్ని రకాల పరీక్షలు చేశాకే ఈవీఎంలను ఉపయోగిస్తారు. ఎవరైతే హ్యాక్ అంటున్నారో వారే ప్రత్యక్షంగా హ్యాక్ ఎలా చేస్తారో చేసి చూపితే బాగుంటుంది. అనవసర విమర్శలు వదిలేసి ఓటమి పాలైన వారు కొత్త ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా సహకరించడం మంచిది. 

కనుమ ఎల్లారెడ్డి, తాడిపత్రి