6 May, 2026 | 8:56 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

17-09-2025 11:28 PM

జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ మాట్లాడుతూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సి.సి.ఈ. నివేదికలు నిర్వహించాలని తెలిపారు. కనీస అభ్యాసన సామర్ధ్యాల సాధనే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి పాఠశాలకు మాధ్యమాల వారీగా ప్రశ్నాపత్రాలు చేరేలా మండల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సకాలంలో డి.సి.ఈ.బి. రుసుము చెల్లించాలని తెలిపారు.