17-07-2025 06:43:17 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వివిధ సంఘటనలో మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలను గురువారం వేలం వేశారు. వాహనాల వేలంలో ప్రభుత్వానికి రూ.9,72,628 ఆదాయం లభించినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కిరణ్, గూడూరు సిఐ బిక్షపతి తెలిపారు.