14 July, 2026 | 7:19 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు

31-01-2026 12:00 AM

నంగునూరు,జనవరి 30: మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షా పులు విచ్చలవిడిగా వెలిశాయని ‘విజయక్రాంతి’ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘వైన్స్ యజమానుల బెల్ట్ దందా‘ కథనానికి ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించారు. హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ నేతృత్వంలోని బృందం శుక్రవారం రాంపూర్, జేపీ తండా గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో ఇళ్ల మ ధ్య అనధికారికంగా నిల్వ ఉంచిన 13.6 లీటర్ల మద్యం, 26 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, మండలవ్యాప్తంగా నిరంతర తనిఖీలు చేపడతామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్త్స్ర రూప, ట్రైనీ ఎస్త్స్ర మధుసూదన్ పాల్గొన్నారు. సమస్యపై స్పందించి అధికారులను పరుగులు పెట్టించిన ’విజయక్రాంతి’ పత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ, అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.