16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

22-10-2025 06:09 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మండలంలోని చిరకుంట గ్రామంలో అరిగెల లక్ష్మయ్య 33వ వర్ధంతి సందర్భంగా బుధవారం వారి కుమారులు అరిగెల నాగేశ్వరావు, మల్లికార్జున్, వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ముందుగా వారి కుమారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వైద్యులచే రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు.

ఈ వైద్య శిబిరంలో 100కు పైగా రోగులకు వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు మాట్లాడుతూ మాతండ్రి గారైన లక్ష్మయ్య జ్ఞాపకార్ధం ఆయన వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచిత వైద్యంతో పాటు మందులను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సుంకరి పెంటయ్య, నాయకులు గాజుల రాజేంద్రప్రసాద్, మేకర్తి లచ్చన్న, శరత్, దీపక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.