calender_icon.png 14 September, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమారుడిని హత్య చేసి నదిలో పడేసిన తండ్రి

14-09-2025 09:26:23 AM

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. హత్య అనంతరం తండ్రి.. బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టి నయాపూల్ వద్ద మూసి నదిలో పడేశాడు. కాగా కుమారుడు కనిపించట్లేదని తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించగా.. పోలీసుల విచారణలో తండ్రి మహమ్మద్ అక్బర్ నిజాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోలీసులు బాలుడు మృతదేహం కోసం మూసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.