27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

08-11-2025 12:00 AM

ఆదిలాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్ అన్నారు.  శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న రూ. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక వినాయక చౌక్ లో రాస్తారోకో చేపట్టారు.

దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్  మాట్లాడుతూ... స్కాలర్షిప్,  ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం ఇచ్చే బిక్ష కాదని, దిన్ని పాలకులు  గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వినర్ నిఖిల్, ఆదిత్య, రాజ్, కిరణ్, పృథ్వి, సాయి, రంజిత్, వరుణ్, శ్రీధర్, వర్ధన్, విగ్నేష్, సాయికుమార్ పాల్గొన్నారు.