12-12-2025 12:52:26 AM
మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ని బడి తండాకి చెందిన కడు బీదవాడైన బానో త్ సందీప్ గురువారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో దహన సం స్కారాలకు ఆ నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఎస్ జి ఎఫ్ ఆధ్వ ర్యంలో ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం 4000 రూపాయలను చైర్మన్ చిలువేరు సమ్మయ్య గౌడ్ అందజేశారు. బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి, మృతుడి కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.