28-05-2025 07:45:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని అభినందించి పదివేల ఆర్థిక సాయంను మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి(Market Committee Chairman Soma Bheem Reddy) బుధవారం అభినందించారు. వచ్చే నెల జూన్ 4 నుంచి 7 వరకు గోవా రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండర్-17 బాలికల బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో రూ. 10 వేల ఆర్థిక సహాయం చేశారు. జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.