calender_icon.png 22 August, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదం.. రోడ్డున పడిన కుటుంబం

22-08-2025 01:09:09 AM

ఎల్బీనగర్, ఆగస్టు 21 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలతో టైలర్ షాపు, కిరాణ షాపు దగ్ధమైన ఘటన చంపాపేట డివిజన్ లో గురువారం చోటుచేసు కుంది. దీంతో ఓ కుటుంబం రోడ్డున పడిం ది. వివరాల్లోకి వెళ్తే... చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ పరిధిలోని శుభోదయ కాలనీ రోడ్ నంబర్-7 లో ఎరుకల లావణ్య గౌడ్ త న కుటంబ పోషణ కొరకు టైలరింగ్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్నది.

గురువారం ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ షార్ట్ స ర్క్యూట్ వారి బ్రతుకును బుగ్గిపాలు చేసిం ది. బాధితురాలు లావణ్య రోజు మాదిరిగానే గురువారం షాపు తెరిచింది. మధ్యాహ్నం 1గంటల సమయంలో షాపు మూసివేసి, భోజనం చేయడానికి సమీపంలో ఉన్న ఇం టికి వెళ్లింది. ఆ సమయంలో షాపులో వి ద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిందని స్థానికులు లావణ్యకు సమాచారం ఇచ్చారు.

వెంటనే షాపు దగ్గరకు వెళ్లగానే అప్పటికి పూర్తిగా అగ్నికి బూడిదైంది. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.80వేల నగదు, షాపుల ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ, 15 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితురాలు లావణ్య కన్నీరు మున్నీరై విలపిస్తుంది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనికోరారు.