13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

అత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు అరెస్ట్

08-11-2025 12:00 AM

రిమాండ్ కు తరలింపు

కల్వకుర్తి, నవంబర్ 7: కల్వకుర్తి పురపాలక పరిధిలోని సంజాపూర్ లో బుధవారం జరిగిన అత్యాయత్నం కేసులొ ఐదు మంది నిందితులను  అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ తరలించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. సంజపూర్ గ్రామానికి చెందిన గుర్రపు జంగయ్య, అతని భార్య అలివేలు, కొడుకు పరమేష్ లను చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసిన ఆరు మంది నేరస్థులలో చెరుకూరు గ్రామానికి చెందిన దొడ్ల శివ , దొడ్ల ప్రశాంత్, వెల్దండకు చెందిన గంగాపురి రామకృష్ణ , సుభాష్, గుండ్ల నరేశ్ ను  అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ చేసినట్లు తెలిపారు. గుండ్లపల్లి వెంకటేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి  2 బైకులు, 5 సెల్ ఫోన్ లు, దాడికి ఉపయోగించిన కర్రలు , గొడ్డలి పారను సీజ్ చేశామన్నారు.