15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలి

28-01-2026 12:53 AM
  1. బ్యాంకు ఉద్యోగుల సంఘాల డిమాండ్ 

జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకు లావాదేవీలు 

కొత్తగూడెంలో భారీ ర్యాలీ 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 27, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె నిర్వహించారు .ఈ   సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీని ఉద్దేశించి బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి  K. శ్రీకాంత్,  ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్, కార్యదర్శి భవానీ శంకర్, ఎస్బీఐ యూనియన్  ఆర్గనైజింగ్ సెక్రటరీ,  ఈ శాంతి టిసిసిబిఈఏ కార్యదర్శి వి. కృష్ణారావు, డీసీసీబీ, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం తగ్గిం చి, పనివ్యక్తిగత జీవన సమతుల్యత సాధించేందుకు 5 రోజుల బ్యాంకింగ్ విధానం అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఇది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు కూడా మే లు చేసే నిర్ణయమని పేర్కొన్నారు.  డిమాండ్ను అమలు చేయాలని కోరారు.