7 July, 2026 | 6:28 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

మాతృభూమి రక్షణ కోసమే..

29-07-2025 12:05 AM

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘వార్2’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. యష్‌రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీధర్ రాఘవన్ కథను అందిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర కథా రచయిత శ్రీధర్ మాట్లాడుతూ.. “మాతృభూమి రక్షణ కోసం ప్రమాదకరమైన కోవర్ట్ ఆపరేషన్‌లోకి ఇద్దరు ఏజెంట్స్ అడుగుపెడతారు. అవసరమైతే దేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడరు.

దేశం కోసం పోరాడే ఇద్దరు ఏజెంట్లు ఒకరితో మరొకరు ఎందుకు తలపడాల్సి వచ్చిందన్నది సినిమాలో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ఏజెంట్ ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే అంశం థ్రిల్ పంచుతుంది. ” అని చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, హిందీ భాషల్లో కానుంది.