30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గణనాథుడు శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

09-09-2025 11:40 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మారమ్మ యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి శోభాయాత్రలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పైళ్ల శేఖర్ రెడ్డి(Incharge Paila Sekhar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అదేవిధంగా శోభాయాత్రలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బొల్ల సుదర్శన్, ఏలే చంద్రశేఖర్, టేకులసోమరంకు చెందిన చేగూరి మల్లేశం పాల్గొనగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారిని శాలువాలతో సన్మానించారు. శోభాయాత్ర సందర్భంగా యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ, ఎల్ఈడి స్క్రీన్లు, డోలు వాయిద్య కారులు అందరిని ఆకట్టుకున్నాయి.