03-08-2025 10:45:47 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): విద్యార్థుల అక్షర కాదీపిక ఉపాధ్యాయురాలు ఎర్ర సువర్ణ అని మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, పాటి సుభద్ర, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణి కుంట్ల ప్రవీణ్ అన్నారు. ఆదివారం ఆర్పి గార్డెన్ లో సువర్ణ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 35 సంవత్సరాలు మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయురాలుగా ఎర్ర సువర్ణ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారన్నారు.ఈ సందర్భంగా ఆమె సేవలను అభినందించారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కు పాటుపడిందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.