15-10-2025 01:21:28 AM
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంటిట ప్రచారంలో మంగళవారం ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేష్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా రాష్ర్ట నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కృపేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాయకులు ప్రేమ్ కుమార్, మనీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.