6 May, 2026 | 9:48 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

08-08-2025 01:39 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రూ.8.60 కోట్లతో భారీ రాజగోపురం నిర్మాణం 

గుమ్మడిదల, ఆగస్టు 7 : రాష్ర్టంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. దేవాలయం ఆవరణలో రూ.8.60 కోట్ల వ్యయంతో 142 అడుగుల పొడవుతో 9 అంతస్తులతో నిర్మించ తలపెట్టిన రాజగోపురం పనులకు గురువారం ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన బొంతపల్లి దేవస్థానం అభివృద్ధికి గత దశాబ్దికాలంగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆలయంలో రాజ ప్రాకారం, మూడు రాజగోపురాలు సైతం నిర్మించడం జరిగిందని తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో భవిష్యత్తు తరాలకు ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా రాజగోపురం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఆలయ చైర్మన్ ప్రతాప రెడ్డి, మాజీ చైర్మన్ భద్రప్ప, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు;పాల్గొన్నారు.