08-08-2025 01:41:17 AM
సిద్దిపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులుతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను ఆయనకు వివరించడంతోపాటు, బీసీ బిల్లు పైన చర్చించారు. బీసీ బిల్లుపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అశోక్ గెల్లాట్ సూచించినట్లు హరికృష్ణ తెలిపారు.