9 April, 2026 | 9:30 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలి

08-11-2025 12:03 AM

మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి డిమాండ్

ఆళ్ళపల్లి, నవంబర్ 7, ( విజయక్రాంతి): జిల్లాలో అన్ని మండలాల్లో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి డిమాండ్ చే శారు. శుక్రవారం బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల కేంద్రం నుండి కాచనపల్లి వెళ్లే మార్గమధ్యంలో ప్రమాదకరంగా ఉన్న గుంతలను మట్టితో పూడ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

గుంతల మయంగా ఉన్న రో డ్ల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రమాదకరంగా ఉన్న రహదా రుల పై డిజిటల్ క్యాంపెయిన్ కు పిలుపు నిచ్చారు. మణుగూరు బి ఆర్ ఎస్ భవన్ పై జరిగిన దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూసం. నాగేష్, రఘుపతి ,మొక్కటి రామ్ చరణ్ , కుంజ రవితేజ , గొగ్గేల సాత్వి క్ , కోరం.రంజిత్. తదితరులు పాల్గొన్నారు.