calender_icon.png 17 August, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

16-08-2025 06:30:04 PM

తాడ్వాయి (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తాడ్వాయి ఎస్సై మురళి(SI Murali) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో శనివారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్మించుకోవాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యువజన సంఘాల సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.