22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మాఘ స్నానాలకు ఘనంగా ఏర్పాట్లు

18-01-2026 01:09 AM

ఏడుపాయల్లో మాఘ స్నానం ఆచరించనున్న వేలాది మంది భక్తజనం

పాపన్నపేట, జనవరి 17: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో ప్రతి మాఘ అమావాస్య పర్వదినాన వనదుర్గమ్మ చెందన మాఘస్నానాలు చేసేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. మాగస్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చెంతనే ఉన్న వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా జలకల సంతరించుకుంది. భక్తులు పుణ్య స్నాన మాచరించేటప్పుడు నీటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు కల్పించనున్నారు.