02-01-2026 12:49:03 AM
ఆమనగల్, జనవరి 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన సంవత్సరం వేడుకలు పురస్కరించుకొని సీఎంకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.