17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పట్వారి వ్యవస్థను రద్దుచేసి స్వేచ్ఛ సమానత్వం తెచ్చిన మహనీయుడు -ఎన్టీఆర్

21-11-2025 11:55 PM

ఎన్టీఆర్ ఆశయాలను సాధించాలి

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

గరిడేపల్లి,(విజయక్రాంతి): పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం తెచ్చిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు పనిచేయాలని టిడిపి హుజూర్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎన్టీఆర్  తెలుగుదేశం హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయిందని ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని ప్రజల చెంతకు చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల దేవుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు.