26-07-2025 12:00:00 AM
కాగజ్నగర్, 25 జూలై (విజయ క్రాంతి): మండలంలోని బలగల పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియ ల్ పాఠశాల కాగజ్నగర్ ఎంపీడీవో కోట ప్రసాద్ తనిఖీ చేశారు. ఉ పాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టి క పరిశీలించి, వంట సరుకులు, కూరగాయలు, వంటగది, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు.
నాణ్యత ప్రమాణాలతో కూడిన నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు వస్తున్నాయ అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మంచినీటి ట్యాంకును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూమీ ఫాతిమా, ఏపీవో చంద్రశేఖర్ , కార్యదర్శి హరీష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.