18 April, 2026 | 11:47 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రయాణికుడికి సెల్ ఫోన్ అప్పగింత..

20-05-2025 10:13 PM

వైరా (విజయక్రాంతి): సెల్ ఫోన్ మర్చిపోయిన ప్రయాణికునికి వైరా బస్టాండ్(Wyra Bus Stand) కంట్రోలర్ వెంకన్న, ప్యాసింజర్ గైడ్ కోట నాగేశ్వరరావులు వ్యక్తికి తిరిగి సెల్ ఫోన్ ను మంగళవారం అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మాలోత్ నరసింహ ఖమ్మం వెళ్లుటకు వైరా బస్టాండ్ కు వచ్చి సెల్ ఫోను మరిచి ఖమ్మం బస్సు రాగానే హడావాడిగా బస్సు ఎక్కాడు. కొద్దిసేపటికి బస్టాండ్ లో ఓ సెల్ ఫోన్ తారసపడటంతో గమనించిన కంట్రోలర్ వెంకన్న, ప్యాసింజర్ గైడ్ కె. నాగేశ్వరరావులు ఆ ఫోన్ను భద్రపర్చారు. ఆ ప్రయాణికుడు ఫోన్ పోయిన విషయం గమనించి తిరిగి వైరా బస్టాండ్ కు రాగా అతనికి అప్పగించారు. దీంతో అతను ఆర్టీసీ సంస్థతో పాటు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.