18 April, 2026 | 10:08 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వడదెబ్బతో యువకుడు మృతి..

20-05-2025 10:20 PM

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..

బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల(Boath Mandal) కేంద్రంలో షేక్ అమన్(18) అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక న్యూ కాలనీకి చెందిన షేక్ అమన్ వేసవి సెలవుల కారణంగా కొన్ని రోజులుగా ఎండలో క్రికెట్ ఆడుతున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం క్రికెట్ మైదానంలో అస్వస్థత గురై తీవ్ర వాంతులు చేసుకోగా స్థానికులు బోథ్ అస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వడదెబ్బ వల్ల యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.