13-08-2025 05:28:07 PM
కుబీర్: కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీనీ బుధవారం నిర్వహించారు. పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని అన్ని కాలనీలో జాతీయ జెండాలతో విద్యార్థులు జాతీయ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.