22 May, 2026 | 11:06 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

తిరుమలలో భారీ వర్షం

13-12-2024 02:09 AM
  • పాపవినాశనం దారి తాత్కాలికంగా మూసివేత
  • తిరుపతిలోనూ పలు కాలనీలు జలమయం

హైదరాబాద్, డిసెంబర్ 12(విజయక్రాంతి): తిరుమల, తిరుపతిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఈక్రమంలో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమా దం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కాగా పాపవినాశనం, గోగర్భం పూర్తిగా నిండి ప్రవహిస్తుండటంతో ఆ దారులను తాత్కాలికంగా మూసివేశారు.

తిరుపతిలోనూ వర్షం దంచికొట్టడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు వరద చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. మాల్వాడిగుండం జలపాతం పొర్లుతున్నది. కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను అధికారులు నిలిపివేశారు.