24-09-2025 12:58:17 AM
కలెక్టరేట్ కు తరలిన మానాల గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 23 (విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లాలో హలో మానాల చలో కలెక్టరేట్. భవిష్యత్ తరాల కోసం అడుగులను కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామస్తులు మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్ కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు.
అధికారులకు ఇచ్చిన వినతి పత్రంలో సమస్యలు వివరించారు. కొందరు అక్రమంగా అడవులను నరుకుతున్నారని ఆరోపించారు. అధికారులు చూసి చూడంగానే ఉండడంపై మండిపడ్డారు. అధికారు తక్షణం స్పందించి అడవులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మానాల గ్రామస్తులు పాల్గొన్నారు.