9 April, 2026 | 11:04 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

గర్రెపల్లి ఆసుపత్రిలో హెపటైటిస్ వ్యాధి నిరోధక టీకాలు ప్రారంభం..

14-10-2025 06:31 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమమును మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పెద్దపల్లి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ హెపటైటిస్ బి వ్యాధి ముఖ్యంగా రక్తం, శరీర ద్రవాల వ్యాప్తి చెందుతుంది, అందువలన హెపటైటిస్ బి సోకిన వ్యాధికి సేవలు అందించే క్రమంలో ఈ వ్యాధి వైద్య సిబ్బందికి సోకే అవకాశం ఉంది అని అన్నారు. అందుకు వైద్య సిబ్బంది రక్షణ కొరకు ఈ వ్యాధి నిరోదక కార్యక్రమం చెప్పట్టడం జరిగిందన్నారు. జీరో డోస్ తీసుకున్నాక నెలకు ఒక డోస్, 6 నెలల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి. కిరణ్ కుమార్, స్థానిక వైద్యుడు డా.ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.