15 June, 2026 | 10:18 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

విద్యుత్ అధిక చార్జీలను వెంటనే తగ్గించాలి

15-10-2025 12:54 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. విద్యుత్ బిల్లులు తీసే సమయంలో బ్రంట్  మీటర్ అని బిల్లు తీసి అదనంగా 1160 రూపాయల బిల్లు విధిస్తున్నారని విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. ఇలా మండలంలో ఎంతోమంది విద్యుత్ వినియోగదారుల మీటర్లకు అదనంగా చార్జీలు చేసినట్లు విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. సామాన్య ప్రజల నుండి అధిక కరెంటు చార్జీలు విధించడం పట్ల విద్యుత్ వినియోగదారులు మండిపడుతున్నారు. సమయానికి బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తారు కానీ విద్యుత్ అధికారులు అధిక చార్జీలు విధిస్తే బాధ్యులు ఎవరని విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇట్టి విషయమై సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విధించిన అధిక చార్జీలను తొలగించి బిల్లులు తగ్గించాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.