12 May, 2026 | 11:48 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

మామిడిలో అంతర పంటల సాగుతో అధిక లాభాలు

09-09-2025 09:49 PM

వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి..

మందమర్రి (విజయక్రాంతి): మామిడి తోటలో అంతర పంటల సాగు ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) అన్నారు. మండలంలోని మామిడిగట్టు గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు మామిడిలో అంతర పంటల సాగు ప్రయోజనాలను వివరించారు. గ్రామంలో 650 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా,  550 ఎకరాలలా మామిడి తోటలు గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తూ మామిడిగట్టు నామధ్యేయాన్ని సార్ధకం చేసుకున్న గ్రామంగా గుర్తింపు ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా మామిడిలో సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మామిడి తోటలను పూర్తిగా తీసివేయకుండా మామిడి తోటల మధ్యలో అంతర పంటలుగా పత్తి, పప్పు ధాన్యాలు, వరి వంటి పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ముఖ్యంగా పప్పు ధాన్యాలు సాగు చేయడం ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి భూమి పాటు పెరిగి మామిడి తోటలు కూడా మంచి కాపు నిస్తాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పప్పు ధాన్యాల సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. పప్పు ధాన్యాల మద్దతు ధరతో పాటు పత్తికి కూడా రూపాయలు 8000 క్వింటాలకి మద్దతు  ధర ఉన్నందున, ఒక ఎకరా కి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.