27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్

09-08-2025 03:09 AM

నాలుగు గేట్ల నుంచి నీటి విడుదల 

చేవెళ్ల, ఆగస్టు 8: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి ఒక గేటు ఎత్తగా, శుక్రవారం ఉదయం మరో మూడు గేట్లు తెరిచి 1,400 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1,763.10 అడుగుల వద్ద కొనసాగుతోంది.

మరింత వరద వస్తుండటం, మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వారు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం హిమాయత్ సాగర్‌ను ఆయన పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.