17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఏరియా ప్రాతినిధ్య సంఘం ప్రతినిధులతో నెలవారీ సమావేశం నిర్వహణ

28-05-2025 07:04 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో జీఎం కార్యాలయం నందు ఏరియా యాజమాన్యం, ఏరియా ప్రాతినిధ్య సంఘం ప్రతినిధుల మధ్య ఏరియా స్థాయి నెలవారీ సమావేశం ఏరియా జీఎం వి కృష్ణయ్య(Area GM V Krishnaiah) అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (Singareni Coal Mines Labour Union-INTUC) తరపున జే.వెంకటేశ్వర్లు ఏరియా వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ఇల్లందు ఏరియాలో పనిచేసే కార్మికులు వారి పని స్థలాలలో ఎదుర్కొనే పలు సమస్యలను, విన్నపాల గురించి ప్రాతినిధ్య సంఘం తరపున ఏరియా జీఎం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కార దిశకై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం వి.కృష్ణయ్య స్పందించి, సాధ్యమయ్యంతవరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జి.యం. రామస్వామి, కే.ఓసి. పి. ఓ గోవింద రావు, జెకె. ఓసీ పి. ఓ. కృష్ణ మోహన్ ఏరియా ఇంజనీర్ ఆర్వీ నరసింహరాజు, డీజియం(సివిల్) రవికుమార్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, ఏరియా వర్క్ షాప్ పవన్ కుమార్, క్రిస్టఫర్, దిపిప్ కుమార్ ప్రాతినిధ్య సంఘం తరపున, కే.సత్యనారాయణ ఆర్.బాబు రావు, పి. మాధవ రావు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.