6 May, 2026 | 11:21 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

17-09-2025 12:00 AM

 చేగుంట, సెప్టెంబర్ 15 :చేగుంట మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ , తహసిల్దార్ శ్రీకాంత్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఉ పాధ్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైనదని, దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మింపబడుతుందని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, ఉపాధ్యాయులు జాతి ని ర్మాతలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచలంచలుగా ఎదిగి రాష్ట్రపతిగా అయి ఆ వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడు అని అన్నారు.

మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఎం.అనిత, ఎం.శ్రీవాణి, ఎన్.సంతోషి, ఎన్.ధనుంజయ, కే.సునీత, పి.భవాని, ఎస్.బి.ఆర్ సరస్వతి, ఎంఏ.నయీమ్, జీ.శారద, సౌజన్య, రమ్యశ్రీ, ఆర్.సత్యనారాయణ, కే.విజయేందర్ రెడ్డి, టి.రాములు, కే.మురళీకృష్ణ, బి.శంకర్రావు, పి.ఊర్మిళ, టి.ఎల్లయ్య, వి.కిషన్, జిల్లా అవార్డు గ్రహీతలు జీ.రాధ, ఎన్.శంకర్, ఎం శ్రీలత,మరియు సి అర్ పి రమేష్, ప్రవీణ్, వినోదలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిజిహెచ్‌ఎంలు అమర్, శేఖర్ రెడ్డి, చంద్రకళ, కృపాకర్ రెడ్డి, కృష్ణారావు, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.