08-08-2025 01:46:41 AM
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకలు
జడ్చర్ల ఆగస్టు 7 : జిల్లావ్యాప్తంగా గురువారం భారీ ఎత్తున వర్షపాతం నమోదయింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటల వరకు ఏదావిధిగా కొనసాగింది. దీంతో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రజలు తీరా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల పట్టణ ప్రాంతాల్లో ఓ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గం లోని గైరాన్ తండాలో బారి వర్షానికి తల్లీ తండ్రులు లేని పిల్లలు పా తూలవత్ స్వప్న .చరణ్ ఉన్న ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.