17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక... ఆంక్షలు అమలు

08-11-2025 05:24 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీ.సీ. సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఈ నెల 14న ఉదయం 6 గంటల నుంచి 15 ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు విధించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం షాపులన్ని మూసివేయాలని, జూబ్లీహిల్స్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబులు మూసివేయాలని సీపీ సూచించారు. రేపటి నుంచి ఎన్నిక కౌంటింగ్ ముగిసే వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలవుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని, ఓట్ల లెక్కింపు రోజున రోడ్లు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.