2 April, 2026 | 3:51 PM

Breaking News

ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు   •   కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?   •   కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •  

హాకీ రాష్ట్రస్థాయి పోటీలకు కృష్ణసాగర్ గురుకుల విద్యార్థుల ఎంపిక

08-11-2025 06:39 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని కృష్ణసాగర్ లో ఉన్న తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అండర్–17 విభాగంలో హాకీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మెండెం దేవదాస్ తెలిపారు. జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించగా, కృష్ణసాగర్‌ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారు. బైపీసీ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పి. సాయిరాం, ఎస్. సాయి కార్తీక్, ఎస్. కృష్ణ మనోహర్, కే. కిరణ్, పి. అనిల్ లను ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.