13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఫైర్ సేఫ్టీపై హైడ్రా ఉక్కుపాదం

30-01-2026 12:29 AM
  1. జూబ్లీహిల్స్ నీరూస్ సీజ్
  2. నాంపల్లి స్టేషన్ రోడ్డులో భారీ ఫర్నీచర్ షోరూమ్‌కు తాళం

హైదరాబాద్ సిటీ బ్యూరో/ఖైరతాబాద్, జనవరి29 (విజయక్రాంతి) : నగరంలోని వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైడ్రా తన తనిఖీలను ముమ్మరం చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను గాలికి వదిలేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న షోరూమ్‌లపై హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్ చర్యలు చేపట్టారు. గురువారం జూబ్లీహిల్స్లోని ప్రముఖ వస్త్ర షోరూ మ్ నీరూస్‌తోపాటు నాంపల్లిలోని ఒక భారీ ఫర్నీచర్ షోరూమ్‌ను అధికారులు సీజ్ చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ షోరూమ్‌లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మూ డు సెల్లార్లు, నాలుగు అంతస్తులు కలిగిన ఈ భవనంపై అనుమతి లేకుండా రూఫ్ షెడ్డు వేసి, భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. అమ్మకాలు జరపాల్సిన చోట వస్త్రాల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్, గోదాములా మార్చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీ సం ఫైర్ ఎన్వోసీ లేకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు  పనిచేయకపోవడం తో వెంటనే షోరూమ్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు.

విద్యుత్ అధికారులు పవర్ కట్ చేయగా, ఫైర్ అన్‌సేఫ్ షాప్ అని రాసి ఉన్న బోర్డులను అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని రహీమ్, మన్నన్ ఎస్టేట్‌కు చెందిన ఆరు అంతస్తుల స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణాన్ని తనిఖీ చేయ గా.. సెల్లార్ నుంచి పై అంతస్తు వరకు మెట్ల మార్గాన్ని కూడా వదలకుండా ఫర్నీచర్‌ను కుక్కేసినట్లు గుర్తించారు. ఎక్కడా ఫైర్ ఎన్వో సీ గానీ, అగ్నిమాపక పరికరాలు గానీ లేకపోవడంతో ఆ భవనానికి తాళం వేసి సీజ్ చేశారు. తనిఖీల్లో హైడ్రా, ఫైర్, జీహెచ్‌ఎంసీ ,విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.