9 April, 2026 | 11:07 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

టికెట్ ధరల పెంపు జీవోలతో నాకు సంబంధం లేదు

11-01-2026 12:24 AM

గతంలో కానీ, ప్రస్తుతం కానీ రాష్ట్రంలో సిని మా టికెట్ ధరలు పెంచేందుకు తానెప్పుడూ అనుమతి ఇవ్వలేదని సినిమాటోగ్రఫీశాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై విలేకరు లు ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ.. “సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానే శాను. ‘పుష్ప2’ తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరలను పెంచాలంటూ నా దగ్గరకు రావొద్దని చెప్తూనే ఉన్నా. ఆ మధ్య వచ్చిన రెండు సినిమాలు, తాజాగా వచ్చి న సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలూ నా వద్దకు రాలేదు.

అప్లికేషన్ పెట్టుకోవద్దని నేనే చెప్తున్నా. నన్ను ఎవరూ కలవడం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ చనిపో యింది. ఎందుకు పరిష్మన్ ఇచ్చానా? అనిపించింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచబోమని ఆ మరుసటి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఇప్పటివరకూ ఒక్క సంతకం కూడా పెట్టలేదు. నల్గొండకు సంబంధించిన అభివృద్ధి పనులు చూసు కుంటూ, వాటిని సమీక్షించుకుంటూ రాత్రే వచ్చాను. నేను సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు వస్తే, పేద కళాకారుల విషయంలోనే జోక్యం చేసుకున్నా. అంతే తప్ప, టికెట్ ధరల పెంపు జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అన్నారు.