05-12-2025 12:21:02 AM
గాంధారి, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): గాంధారి మండల కేంద్రం లోని ఆధర్శ హై స్కూల్ విద్యార్థి మహేందర్ సపాక్ థక్రోవ్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహేందర్ తెలిపారు.ఈ విశిష్ట సాధనపై పాఠశాల నిర్వహణ మరియు అధ్యాపకులు విద్యార్థిని అభినందిస్తూ, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థలు పాల్గొన్నారు.